నల్లమల ఎన్కౌంటర్ బూటకం: గద్దర్
హైదరాబాద్: నల్లమల అడవుల్లో జరిగింది బూకటపు ఎన్కౌంటర్ అని ప్రజా వాగ్గేయకారుడు గద్దర్ విమర్శించారు. తెలంగాణలో బోనాల జాతర జరుగుతుంటే ప్రభుత్వం నల్లమలలో నెత్తుటి జాతర నిర్వహించిందని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ఎన్కౌంటర్ మృతుల శవాలను వారి బంధువులకు 24 గంటల లోపు అప్పగించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసులపై ఐపిసి 302 కింద కేసు నమోదు చేయాలని కూడా ఆయన డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత శాంతిచర్చల పేరు మీద రక్తపాతం సృష్టిస్తోందని ఆయన అన్నారు. నల్లమలలో జరిగినవి ఏకపక్ష కాల్పులని ఆయన అన్నారు. నల్లమలలో కూంబింగ్ ఆపేయాలని ఆయన డిమాండ్ చేశారు. మావోయిస్టు రాష్ట్ర కార్యదర్శి మాధవ్కు రక్షణ కల్పించాలని పౌరహక్కుల సంఘం డిమాండ్ చేసింది. అడవిలో కూంబింగ్ ఆపేయాలని కూడా డిమాండ్ చేసింది.