వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నక్సల్స్ పట్ల మా విధానం అదే: టిడిపి
హైదరాబాద్: నక్సలైట్ల పట్ల తమ విధానంలో మార్పులేదని తెలుగుదేశం పార్టీ నాయకుడు, మాజీ మంత్రి విజయరామారావు అన్నారు. హింసకు ప్రతిహింస సమాధానం కాదనేది తమ విధానమని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. నక్సలైట్ల వైపు నుంచి గానీ, ప్రభుత్వం వైపు నుంచి గానీ చట్టవిరుద్ధం జరగకూడదనేది తమ విధానమని, దానికే కట్టుబడి వున్నామని ఆయన వివరించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత విధానాలను అనుసరిస్తోందని ఆయన విమర్శించారు. తాము చట్ట విరుద్ధ కార్యక్రమాలను ఏనాడూ సమర్థించలేదని ఆయన అన్నారు. నక్సలైట్ సమస్య పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేశామని ఆయన అన్నారు.
Comments
Story first published: Sunday, July 23, 2006, 23:53 [IST]