వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
బూటకపు ఎన్కౌంటర్లు సమర్థనీయం కాదు: బాబు
మహబూబ్నగర్: బూటకపు ఎన్కౌంటర్లు సమర్థనీయం కాదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అన్నారు. ఆయన సోమవారం నాడు చికన్ గన్యా వ్యాధిగ్రస్థులను పరామర్శించారు. రాష్ట్రంలో చికన్గన్యా వ్యాధి లేదనడం నిజం కాదని ఆయన అన్నారు. గన్యా రోగుల కుటుంబాలకు 25 కిలోల బియ్యం, 5 కిలోల పప్పు సరఫరా చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో ఆరోగ్య అత్యవసర స్థితిని ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. చికన్ గన్యా వాధిని నిరోధించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, అందువల్ల కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని ఆయన అన్నారు. చికన్ గన్యా రోగులకు ఎన్టిఆర్ చారిటబుల్ ట్రస్టు ద్వారా సహాయం అందిస్తామని ఆయన చెప్పారు.
Story first published: Monday, July 24, 2006, 23:53 [IST]