వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మా సత్తా ఏమిటో నిరూపించాం: డిజిపి
హైదరాబాద్: మావోయిస్టు రాష్ట్ర కమిటీ కార్యదర్శి మాధవ్తో పాటు 8 మంది నక్సల్స్ ఎన్కౌంటర్తో తమ సత్తా ఏమిటో రుజువైందని రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ (డిజిపి) స్వరణ్జిత్ సేన్ అన్నారు. నక్సల్స్ లొంగిపోవాలని, లేదంటే పర్యవసానమేమిటో నక్సల్స్కు తెలుసునని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు.
గెరిల్లా యుద్ధతంత్రంలో ఆరితేరిన నక్సల్స్ను అంతం చేయడం అంతం చేయడం అంత సులభం కాదని, పక్కా సమాచారం మేరకే మాధవ్ ఆచూకీ కనుక్కున్నామని ఆయన అన్నారు. పోలీసుల అదుపులో నక్సల్స్ ఎవరూ లేరని ఆయన స్పష్టం చేశారు. తమకు పటిష్టమైన నిఘా వ్యవస్థ ఉందని ఆయన చెప్పారు. ఎన్కౌంటర్పై వివరణ ఇస్తామని, వివరణ ఇవాల్సిన అవసరం తమకు ఉందని ఆయన అన్నారు.
Comments
Story first published: Monday, July 24, 2006, 23:53 [IST]