వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
దళ సభ్యురాలి సమాచారంతోనే మాధవ్పై దాడి
హైదరాబాద్: పోలీసులకు చిక్కిన దళ సభ్యురాలు ఇచ్చిన సమాచారం మేరకే తమ రాష్ట్ర కమిటీ కార్యదర్శి మాధవ్పై పోలీసులు దాడి చేశారని మావోయిస్టు మహబూబ్నగర్ జిల్లా కార్యదర్శి సాంబశివుడు అన్నారు. సాంబశివుడి పేర ఒక పత్రికా ప్రకటన మీడియా కార్యాలయాలకు చేరింది. నల్లమల ఎన్కౌంటర్పై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతదేహాలను వెంటనే బంధువులకు అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు.
మృతుల కుటుంబాలకు ప్రభుత్వ సాయం అక్కర్లేదని ఆయన అన్నారు. ప్రభుత్వం డబ్బులిస్తే తీసుకోవద్దని ఆయన మృతుల బంధువులకు విజ్ఞప్తి చేశారు. మాధవ్ను అరెస్టు చేయడానికి అవకాశం వున్నప్పటికీ పోలీసులు కాల్చి చంపారని ఆయన ఇదివరకే మీడియా కార్యాలయాలకు ఫోన్ చేసి చెప్పారు. రేపటి నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు అమరవీరుల సంస్మర కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.
Story first published: Wednesday, July 26, 2006, 23:53 [IST]