వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దళ సభ్యురాలి సమాచారంతోనే మాధవ్‌పై దాడి

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: పోలీసులకు చిక్కిన దళ సభ్యురాలు ఇచ్చిన సమాచారం మేరకే తమ రాష్ట్ర కమిటీ కార్యదర్శి మాధవ్‌పై పోలీసులు దాడి చేశారని మావోయిస్టు మహబూబ్‌నగర్‌ జిల్లా కార్యదర్శి సాంబశివుడు అన్నారు. సాంబశివుడి పేర ఒక పత్రికా ప్రకటన మీడియా కార్యాలయాలకు చేరింది. నల్లమల ఎన్‌కౌంటర్‌పై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతదేహాలను వెంటనే బంధువులకు అప్పగించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

మృతుల కుటుంబాలకు ప్రభుత్వ సాయం అక్కర్లేదని ఆయన అన్నారు. ప్రభుత్వం డబ్బులిస్తే తీసుకోవద్దని ఆయన మృతుల బంధువులకు విజ్ఞప్తి చేశారు. మాధవ్‌ను అరెస్టు చేయడానికి అవకాశం వున్నప్పటికీ పోలీసులు కాల్చి చంపారని ఆయన ఇదివరకే మీడియా కార్యాలయాలకు ఫోన్‌ చేసి చెప్పారు. రేపటి నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు అమరవీరుల సంస్మర కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X