వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వార్థానదిలో పడి ముగ్గురు మృతి: 11 మంది గల్లంతు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: ఆంధ్రా - మహారాష్ట్ర సరిహద్దులోని వార్ధా నదిలో పడవ మునిగి ముగ్గురు మరణించారు. 11 మంది గల్లంతయ్యారు. మరణించినవారు ఆంధ్రేతరులు. కొందరిని స్థానికులు కాపాడారు. మృతి చెందినవారందరూ ఆంధ్రేతరులు. ఆదిలాబాద్‌ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన కొంత మంది ప్రాణాలతో బయటపడ్డారు. గంగవరం పోర్టు జెట్టీ నిర్మాణం వల్ల సముద్రం అలలు దిబ్బపాలెం వద్ద ఎగిసిపడుతున్నాయి. దీంతో ఐదు గుడిసెలు నేలమట్టాయి. నిరాశ్రయులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

బంగాళాఖాతంలో ఒరిస్సాకు, పశ్చిమ బెంగాల్‌కు పశ్చిమ వాయవ్య దిశలో అల్పపీడనం కేంద్రీకృతమైంది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదులతోందని వాతావరణ పరిశోధన కార్యాలయం అధికారులు తెలిపారు. దీని ప్రభావం వల్ల ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తర కోస్తా, ఉత్తర తెలంగాణ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం వుంది. తీరం వెంబడి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం వుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X