వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బహ్రెయిన్‌లో 16 మంది సజీవ దహనం

By Staff
|
Google Oneindia TeluguNews

మనామా: బహ్రెయిన్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో 16 మంది భారతీయులు సజీవ దహనమయ్యారు. వీరిలో ఎక్కువ మంది తమిళనాడు రాష్ట్రానికి చెందినవారే. బతుకుదెరువు కోసం వారు ఇక్కడికి వచ్చారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం తెల్లవారు జామున 350 మంది భారతీయులు వుంటున్న భవన సముదాయంలో అగ్ని ప్రమాదం సంభవించింది. షార్ట్‌ సర్క్యూట్‌ వల్ల ఈ ప్రమాదం సంభవించినట్లు భావించారు.

బహ్రెయిన్‌లోని గుడబియా ప్రాంతంలో భారత కాలమానం ప్రకారం ఆదివారం తెల్లవారుజామున ఐదున్నర గంటలకు ఈ ప్రమాదం సంభవించింది. గాయపడిన వారికి ఆస్పత్రిలో చికిత్స అందించారు. మరణించినవారిలో ఎక్కువ మంది రాయల్‌ టవర్స్‌ నిర్మాణంలో పాలు పంచుకున్నవారని బహ్రెయిన్‌లో భారత రాయబారి బాలకృష్ణన్‌ శెట్టి చెప్పారు. మంటలు, పొగల వల్ల ఊపిరాడక చాలా మంది మరణించారని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X