వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
బహ్రెయిన్లో 16 మంది సజీవ దహనం
మనామా: బహ్రెయిన్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 16 మంది భారతీయులు సజీవ దహనమయ్యారు. వీరిలో ఎక్కువ మంది తమిళనాడు రాష్ట్రానికి చెందినవారే. బతుకుదెరువు కోసం వారు ఇక్కడికి వచ్చారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం తెల్లవారు జామున 350 మంది భారతీయులు వుంటున్న భవన సముదాయంలో అగ్ని ప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం సంభవించినట్లు భావించారు.
బహ్రెయిన్లోని గుడబియా ప్రాంతంలో భారత కాలమానం ప్రకారం ఆదివారం తెల్లవారుజామున ఐదున్నర గంటలకు ఈ ప్రమాదం సంభవించింది. గాయపడిన వారికి ఆస్పత్రిలో చికిత్స అందించారు. మరణించినవారిలో ఎక్కువ మంది రాయల్ టవర్స్ నిర్మాణంలో పాలు పంచుకున్నవారని బహ్రెయిన్లో భారత రాయబారి బాలకృష్ణన్ శెట్టి చెప్పారు. మంటలు, పొగల వల్ల ఊపిరాడక చాలా మంది మరణించారని ఆయన చెప్పారు.
Comments
Story first published: Sunday, July 30, 2006, 23:53 [IST]