వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తెలంగాణ ఇవ్వకపోతే తడాఖా చూపిస్తాం: నరేంద్ర
హైదరాబాద్: కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రం ఇవ్వకపోతే తమ తడాఖా చూపిస్తామని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అగ్రనేత, కేంద్ర మంత్రి ఎ. నరేంద్ర అన్నారు. తాము కాంగ్రెస్ను విశ్వసించామని, కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు చర్యలు తీసుకోకపోతే తామేమిటో చూపిస్తామని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధులతో అన్నారు.
కాంగ్రెస్ స్పష్టమైన ప్రకటన చేయకపోతే ఏం చేస్తారని అడిగితే తమ వ్యూహం తమకు ఉందని, ఇప్పుడే దాన్ని వెల్లడించబోమని ఆయన జవాబిచ్చారు. ఆగస్టు 15వ తేదీ గడువు పెట్టారు కదా అని మీడియా ప్రతినిధులు అంటే అది కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన గడువేనని, తాము పెట్టిన గడువు కాదని ఆయన అన్నారు. ఈసారి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు చర్యలు తీసుకోకపోతే ఊరుకునేది లేదని ఆయన అన్నారు.
Comments
Story first published: Sunday, July 30, 2006, 23:53 [IST]