తుపాను బీభత్సం: మృతుల సంఖ్య 35
హైదరాబాద్: ఆంధ్ర- ఒరిస్సా సరిహద్దులో వాయుగుండం శుక్రవారం తీవ్ర రూపం దాల్చింది. శ్రీకాకుళం, విశాఖ పట్నం,విజయనగరం జిల్లాల్లో తుపాను మృతుల సంఖ్య 35కుకు చేరుకుంది. కాగా మృతుల సంఖ్య 31 అని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. విశాఖజిల్లా అరకు మండలంలో మట్టిపెళ్ళలు విరిగి పడి ఏడుగురు మరణించారు. విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో పాఠశాలకు సెలవు ప్రకటించారు. ధవళేశ్వరం వద్ద గోదావరి వరద నీరు మొదటి ప్రమాదస్ధాయికి చేరుకుంది. ఇక్కడి నుంచి 9.5 లక్షల క్యూసెక్కుల నీళ్ళను సముద్రంలోకి విడిచి పెట్టారు. శ్రీకాకుళం జిల్లాలో నాగావళి, ఖమ్మం జిల్లాలో కిన్నెరసాని నదులు పొంగిపొర్లుతున్నాయి. వాయుగుండం ఒరిస్సాలోని గోపాలపురానికి 70 కిలోమీటర్ల దూరంలో కేంద్రీ కృతమైంది. విజయనగరం జిల్లాలో కూడా వాగులు పొంగిపొర్లుతున్నాయి. విశాఖపట్నం విమానాశ్రయం నీటిలో మునిగింది. ప్రయాణికులు మోకాలు లోతు నీళ్ళలో నడిచి బయటికి రావలవస్తోంది.