వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వరద బాధిత జిల్లాల్లో రేపు వైఎస్ పర్యటన
హైదరాబాద్: తుపాను, వరదల కారణంగా మరణించిన వారి కుటుంబాలకు రూ.50వేల తక్షణ ఆర్ధిక సహాయాన్ని ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ప్రకటించారు. ఆయన రేపు శనివారం నాడు ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటించి, బాధితులను పరామర్శించనున్నారు. వరద పరిస్ధితిపై ఆయన శుక్రవారం ఉదయం అధికారులతో చర్చించారు. ఉత్తరాంధ్రలో భారీ వర్షాల వల్ల పంట నష్టం బాగానే జరిగిందని, పూర్తి వివరాలు ఇంకా అందవలసి ఉందని రెవిన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు శుక్రవారం మీడియా ప్రతినిధులకు చెప్పారు. తెలంగాణ జిల్లాల్లో కురుస్తున్న వర్షాలు మెట్ట పంటలకు మేలు చేయనున్నాయని, మహబూబ్ నగర్ జిల్లాలో మాత్రం వర్షం పెద్దగా పడలేదని ఆయన చెప్పారు.
Comments
Story first published: Friday, August 4, 2006, 23:53 [IST]