వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మరో 48 గంటల పాటు భారీ వర్షాలు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా తీరాలకు సమీపంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర రూపం దాల్చడంతో వచ్చే 48 గంటల వరకు అంటే ఆదివారం వరకు ఉత్తరాంధ్ర, తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కొనసాగే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. కోస్తా తీరం వెంట పెనుగాలులు వీస్తున్నాయి. జాలర్లను వేటకు వెళ్ళ వద్దని అధికారులు సూచించారు. భద్రాచలం వద్ద గోదావరి, విజయవాడ వద్ద కృష్ణా నదులు పరవళ్ళు తొక్కుతున్నాయి. భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు.
Comments
Story first published: Friday, August 4, 2006, 23:53 [IST]