ముంబై పేలుళ్ళ కేసులో ప్రధాన నిందితుడి అరెస్ట్
ముంబై: ముంబై బాంబు పేలుళ్ళ కేసులో పోలీసులు చెప్పుకోతగ్గ పురోగతి సాధించారు. ఈ కేసుకు సంబంధించిన ఓ లష్కరే తోయిబా తీవ్రవాదిని జమ్ము కాశ్మీర్లో అరెస్టు చేశారు. ముంబై ప్రత్యేక విచారణ బృందం, జమ్ము కాశ్మీర్ కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారుల సహయంతో పూంచ్ జిల్లా సురాన్కోట్లోని ఓ రహస్య స్థావరంపై క్రితం రోజు దాడి చేసి ఈ తీవ్రవాదిని అరెస్టు చేసింది. అబ్దుల్ హమీద్గా ఇతనని పోలీసులు గుర్తించారు. అనంతరం హమీద్ను సంయుక్త పోలీసు బృందాలు విచారించాయి. ముంబైలోని ఓ సెక్యూరిటీ ఏజెన్సీలో గార్డ్గా పనిచేసే ఇతని గుర్తింపు కార్డు బాంబు పేలుళ్ళు జరిగినప్పుడు మాతుంగ రైల్వే స్టేషన్ వద్ద ప్రత్యేక విచారణ బృందానికి లభించింది. దీని ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేయగా, బాంబు పేలుళ్ళు జరిగిన మరుసటి రోజు నుంచి ఇతని జాడ లేదని, అప్పటి నుంచి ఉద్యోగానికి కూడా రావడం లేదని ఆ సెక్యూరిటీ ఏజెన్సీ తెలియజేసింది.