వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పెప్సీ, కోకాకోలాలకు సుప్రీంకోర్టు నోటీసు
న్యూఢిల్లీ: శీతల పానీయాలలో క్రిమి సంహారకాల పరిమాణం ఆందోళనకర స్థాయిలో ఉందని సి.ఎస్.ఇ. వెల్లడించిన నేపథ్యంలో సుప్రీమ్ కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. శీతల పానీయాల్లో వాడే పదార్ధాలు, కెమికల్ మిశ్రమ వివరాలను తెలియజేయాల్సిందిగా కోరుతూ అగ్ర సంస్థలైన పెప్సీ, కోకా కోలాకు సుప్రీమ్ కోర్టు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. న్యాయమూర్తులు ఎస్.బి. సిన్హా, దల్వీర్ భండారీలు ఈ రెండు సంస్థలకు నోటీసులు జారీ చేస్తూ, నాలుగు వారాల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించారు.
Story first published: Friday, August 4, 2006, 23:53 [IST]