నట్వర్కు ముడుపులు ముట్టలేదు: ఎటిఆర్
న్యూఢిల్లీ: ఇరాక్లో చమురుకు ఆహారం పథకం కింద మాజీ విదేశాంగ మంత్రి నట్వర్ సింగ్కు, ఆయన కుమారుడు జగత్ సింగ్కు ఏ విధమైన ముడుపులు ముట్టలేదని జస్టిస్ ఆర్.యస్. పాఠక్ నివేదికపై ప్రభుత్వం సోమవారం లోక్సభలో పెట్టిన యాక్షన్ టేకెన్ రిపోర్టు స్పష్టం చేసింది. సద్దాం హుస్సేన్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన చమురుకు ఆహారం పథకం కింద నట్వర్ సింగ్కు, ఆయన కుమారుడు జగత్ సింగ్కు ముడుపులు ముట్టినట్లు వోకర్ కమీషన్ నివేదిక ఆరోపణలు చేసింది. దీనిపై భారత ప్రభుత్వం జస్టిస్ పాఠక్ కమిషన్ను విచారణ నిమిత్తం నియోగించింది. జస్టిస్ పాఠక్ నివేదికపై ప్రభుత్వం తీసుకున్న చర్యల నివేదికను ఆర్థిక మంత్రి పి. చిదంబరం లోక్సభ ముందుంచారు.
పాఠక్ కమిటీ నివేదికను మంత్రివర్గం సోమవారం ఉదయం ఆమోదించింది. నట్వర్ సింగ్కు డబ్బులు ముట్టినట్లు ఏ విధమైన సాక్ష్యాలు లేవని పాఠక్ కమీషన్ తన నివేదికలో స్పష్టం చేసింది. చమురుకు ఆహారం పథకంలో కాంగ్రెస్ లాభపడినట్లు కూడా ఏ విధమైన సాక్ష్యాధారాలు లేవని పాఠక్ కమీషన్ స్పష్టం చేసింది. కాంట్రాక్టులు పొందేందుకు నట్వర్ సింగ్ తగిన అవకాశం మాత్రమే కల్పించారని యాక్షన్ టేకెన్ నివేదికలో తెలియజేశారు.