హైదరాబాద్లో మావోయిస్టు యాక్షన్ టీమ్: డిజిపి
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో పది మంది మావోయిస్టు యాక్షన్ టీమ్ సభ్యులు ఉన్నట్లు తమకు సమాచారం ఉందని రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ (డిజిపి) స్వరణ్జిత్ సేన్ చెప్పారు. వారిని పట్టుకోవడానికి ప్రయత్నాలు సాగిస్తున్నామని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ఆంధ్రా ఒరిస్సా సరిహద్దుల్లో మినహా మిగతా అన్ని ప్రాంతాల్లో మావోయిస్టులపై తాము అదుపు సంపాదించామని ఆయన చెప్పారు.
నల్లమల అడవుల్లో మావోయిస్టు రాష్ట్ర కమిటీ కార్యదర్శి మాధవ్తో సహా 8 మంది నక్సల్స్ నేపథ్యంలో మావోయిస్టు యాక్షన్ టీమ్ సభ్యులు హైదరాబాద్లో ప్రవేశించి వుండవచ్చునని, భారీ దాడికి దిగడానికి వారు రంగం సిద్ధం చేసుకుంటున్నారని ప్రచారం జరుగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో పలు కీలకమైన ప్రదేశాల్లో పోలీసు భద్రతను పెంచారు. ఇదే సమయంలో హైదరాబాద్లోని రాంనగర్ ప్రాంతంలో మావోయిస్టు యాక్షన్ టీమ్ సభ్యుడు ఆశన్న అలియాస్ వాసుదేవరావు పోలీసులకు చిక్కినట్లు కూడా వార్తలు వెలువడ్డాయి.