వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వరద తాకిడి రాష్ట్రాలకు ప్రధాని హామీ
న్యూఢిల్లీ: వరద తాకిడికి గురైన రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ సోమవారంనాడు టెలిఫోన్లో మాట్లాడారు. వరద బాధితుల కోసం తగిన సహాయం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, ఒరిస్సా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడారు. కేంద్రం తగిన సహాయం అందించడానికి సిద్ధంగా వుందని ఆయన వారికి చెప్పారు.
సహాయ చర్యల కోసం సైన్యాన్ని సిద్ధంగా వుంచినట్లు ప్రధాని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమం।తి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి విలాసరావు దేశ్ముఖ్, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి, ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్లతో ఆయన మాట్లాడారు. రాష్ట్రానికి సైన్యాన్ని పంపాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ప్రధానిని కోరారు. అందుకు ప్రధాని సానుకూలంగా ప్రతిస్పందించారు.
Story first published: Monday, August 7, 2006, 23:53 [IST]