For Daily Alerts
మూసీ నాళాలో కొట్టుకొచ్చిన రెండు శవాలు
హైదరాబాద్: హైదరాబాద్లోని మూసీనది నాళాలో కొట్టుకువచ్చిన రెండు మృతదేహాలు మంగళవారంనాడు బయటపడ్డాయి. హైదరాబాద్లోని అఫ్జల్గంజ్ ప్రాంతంలో ఈ మృతదేహాలు బయటపడ్డాయి. వారిద్దరిని హత్య చేసి నదిలో పడేసి వుంటారని మొదట అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే మద్యం సేవించి మత్తులో ఒళ్లు తెలియక పడిపోయి వుంటారని భావిస్తున్నారు. మృతులను సురేష్, పాండులుగా గుర్తించారు. ఈ ఇద్దరు యువకులు సోమవారం సాయంత్రం బయటకు వెళ్లారని, అప్పటి నుంచి తిరిగి ఇంటికి చేరుకోలేదని చెబుతున్నారు.
Comments
Story first published: Sunday, August 20, 2006, 23:53 [IST]