వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పార్లమెంటు బహిష్కరణ, ఆవరణలో ధర్నా
న్యూఢిల్లీ: స్పీకర్ సోమనాథ్ ఛటర్జీ తమ గొంతును నొక్కేస్తున్నారంటూ జాతీయ ప్రజాస్వామ్య కూటమి (యన్డిఎ) సభ్యులు మంగళవారంనాడు లోక్సభ సమావేశాన్ని బహిష్కరించారు. అనంతరం పార్లమెంటు ఆవరణలో వారు ధర్నాకు దిగారు. ప్రతిపక్ష నాయకుడు లాల్ కృష్ణ అద్వానీ నేతృత్వంలో యన్డిఎ సభ్యులు నల్లబ్యాడ్జీలు ధరించి ఉదయం 11 గంటలకు పార్లమెంటు ప్రధాన ద్వారం వద్ద బైఠాయించారు.
ఇరాక్లో చమురుకు ఆహారం పథకంలో అక్రమాలపై విచారణ జరిపిన పాఠక్ కమిటీ నివేదిక లీక్ వ్యవహారం సోమవారం పార్లమెంటు ఉభయ సభలను కుదిపేసింది. తమ గొంతు నొక్కుతున్నందుకు నిరసనగా యన్డిఎ సభ్యులు ధర్నా చేస్తారని లోక్సభలో ప్రతిపక్ష ఉపనాయకుడు విజయ్కుమార్ మల్హోత్రా సోమవారంనాడు చెప్పారు. అయితే బహిష్కరణను ఉపసంహరిచుకోవాలని స్పీకర్ సోమనాథ్ ఛటర్జీ ప్రతిపక్షాలను కోరారు.
Comments
Story first published: Sunday, August 20, 2006, 23:53 [IST]