వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
610 జీవోను యధాతథంగా అమలు చేయాలి: పిజెఆర్
హైదరాబాద్: ఉద్యోగాల్లో తెలంగాణ స్థానికులకు జరిగిన అన్యాయాన్ని సవరించడానికి జారీ చేసిన 610 జీవోను సవరిస్తూ జారీ చేసిన 72 జీవోపై ఉన్నత స్థాయి సమీక్షా కమిటీని వేయాలనే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ సీనియర్ శాసనసభ్యుడు పి. జనార్దన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దీన్ని ఉపసంహరించుకోకపోతే తెలంగాణ ప్రజల వ్యతిరేకతను చవి చూడాల్సి వస్తుందని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
610 జీవోను ఉన్నదున్నట్లుగా అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దాన్ని సవరిస్తూ జారీ చేసిన 72 జీవో సమీక్షకు కమిటీ వేసి గందరగోళం సృష్టించడం తగదని ఆయన అన్నారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోవడం మంచిదని ఆయన అన్నారు. 610 జీవో అమలుపై ప్రభుత్వం ఇంత హఠాత్తుగా ఎందుకు మేల్కొందో అర్థం కావడం లేదని ఆయన వ్యంగ్యంగా అన్నారు.
Comments
Story first published: Sunday, August 20, 2006, 23:53 [IST]