వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రేపు ఆంధ్ర వరద ప్రాంతాల్లో సోనియా పర్యటన
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లోని వరద తాకిడి ప్రాంతాల్లో రేపు (బుధవారం) కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పర్యటిస్తారు. మహారాష్ట్ర నుంచి ఆమె రేపు మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు. ఆ వెంటనే ఆమె ఖమ్మం జిల్లా పర్యటనకు వెళ్లి బాధితులను పరామర్శిస్తారు. భద్రాచలంలో ఆమె ఒంటి గంటన్నర నుంచి మూడు గంటల వరకు బాధితులను పరామర్శిస్తారు.
అనంతరం సోనియా మూడున్నర గంటలకు తూర్పు గోదావరి జిల్లాలోని అమలాపురం చేరకుంటారు. అక్కడ ఆమె సాయంత్రం మూడున్నర గంటల నుంచి నాలుగున్నర వరకు బాధితులను పరామర్శిస్తారు. ఆ తర్వాత గన్నవరం చేరుకుంటారు. విజయవాడలో సాయంత్రం ఐదు గంటల నుంచి ఆరున్నర గంటల వరకు వరద పరిస్థితిని, చేపట్టిన సహాయ పునరావాస చర్యలను సమీక్షిస్తారు.
Comments
Story first published: Sunday, August 20, 2006, 23:53 [IST]