వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పెన్గంగపై ప్రాజెక్టుకు మేం సిద్ధం: ముఖ్యమంత్రి
ఆదిలాబాద్: పెన్గంగపై ప్రాజెక్టు నిర్మాణానికి తాము సిద్ధమేనని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి చెప్పారు. పెన్గంగ ప్రాజెక్టు నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వమే ముందుకు రావడం లేదని ఆయన అన్నారు. వరద తాకిడి ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రం ఆయన పర్యటించారు. ఆదిలాబాద్ జిల్లాలో 56 వేల ఎకరాల పంట నష్టం జరిగిందని, పంట నష్టపోయిన రైతులను తగు విధంగా ఆదుకుంటామని ఆయన చెప్పారు.
వరద బాధితులకు నష్టపరిహారం పెంచే యోచన లేదని, నిరుడు పెంచిన మేరకే నష్టపరిహారం చెల్లిస్తామని ఆయన చెప్పారు. వరద తాకిడికి ఇళ్లు కోల్పోయినవారందరికీ కొత్తగా ఇళ్లు నిర్మించి ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. వరద పరిస్థితిపై ఏర్పాటయిన సమీక్షా సమావేశంలో పాల్గొనకుండానే ఆయన నిజామాబాద్ జిల్లా పర్యటనకు బయలుదేరి వెళ్లారు.
Story first published: Sunday, August 20, 2006, 23:53 [IST]