వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఇద్దరు డిసియంలు సహా 8 మంది లొంగుబాటు
విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లాలో 8 మంది మావోయిస్టులు గురువారంనాడు డిఐజి గోవింద్ సింగ్ ముందు లొంగిపోయారు. వీరంతా ఆంధ్రా - ఒరిస్సా సరిహద్దు మావోయిస్టు పార్టీకి చెందినవారు. వీరిలో ఇద్దరు డిప్యూటీ దళ కమాండర్లు వున్నారు. మావోయిస్టుల సిద్ధాంతాలతో విసిగి ప్రభుత్వం పునరావాసం కల్పిస్తుందనే ఉద్దేశంతో తాము లొంగిపోయినట్లు డిప్యూటీ దళ కమాండర్లు అంటున్నారు.
నల్లమలలో మావోయిస్టులపై ఆధిక్య సాధించిన తర్వాత ఆంధ్రా - ఒరిస్సా సరిహద్దులపై పట్టు కోసం తాము ప్రయత్నిస్తున్నట్లు గోవింద్సింగ్ చెప్పారు. ఒరిస్సాతో సమన్వయంతో తాము మావోయిస్టులను అడ్డుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని ఆయన చెప్పారు. ప్రస్తుతం ఒరిస్సా రాష్ట్రంలో కూడా మావోయిస్టులను నిషేధించడంతో తమ ప్రయత్నాలు మరింతగా ఫలితాలు ఇస్తున్నట్లు ఆయన తెలిపారు.
Comments
Story first published: Thursday, August 10, 2006, 23:53 [IST]