ముంబాయి పేలుళ్ల కేసు: తీర్పు వచ్చే నెల 12కు వాయిదా
ముంబాయి: 1993 ముంబాయి వరుస బాంబు పేలుళ్ల కేసులో తీర్పు సెప్టెంబర్ 12వ తేదీకి వాయిదా పడింది. ఈ కేసులో టాడా కోర్టు గురువారం తీర్పు వెలువరించాల్సి వుంది. అయితే తీర్పును 12వ తేదీకి వాయిదా వేస్తూ టాడా కోర్టు గురువారం నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రాహిం, బాలీవుడ్ నటుడు సంజయ్ దత్తో సహా 123 మంది నిందితులున్నారు. వీరిలో 86 మంది బెయిల్పై బయటే వున్నారు. తీర్పు వెలువడుతున్న సందర్భంగా గురువారం హాజరు కావాలని బెయిల్పై ఉన్నవారందరినీ కోర్టు ఆదేశించింది.
కోర్టు ఆదేశాల మేరకు సినీనటుడు సంజయ్ దత్ గురువారం ఉదయం కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కోర్టు వద్ద పెద్ద యెత్తున జనసందోహం చోటు చేసుకుంది. ఈ కేసులో ఆయన కొంత కాలం జైలులో కూడా ఉన్నారు. బెయిల్పై విడుదలయ్యారు. సంజయ్ దత్ నుంచి పోలీసులు ఒక ఎ.కె. 47ను కూడా స్వాధీనం చేసుకున్నారు. తీర్పును వాయిదా వేయాలని కోరుతూ ప్రస్తుతం జైలులో వున్న అండర్ వరల్డ్ డాన్ అబూ సలేం తరఫు న్యాయవాది కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రాసిక్యూషన్, డిఫెన్స్ న్యాయవాదుల మధ్య వాదోపవాదాలు జరిగాయి.