వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
హైదరాబాద్కు రేపు ప్రధాని మన్మోహన్ సింగ్
హైదరాబాద్: ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ రేపు (శుక్రవారం) సాయంత్రం హైదరాబాద్ వస్తున్నారు. అయితే ఆయన ఆంధ్రప్రదేశ్లోని వరద తాకిడి ప్రాంతాల్లో పర్యటించడం లేదు. వరద పరిస్థితిని హైదరాబాద్లోని బేగంపేట విమానాశ్రయంలోనే సమీక్షిస్తారు.
మహారాష్ట్రలోని వరద తాకిడి ప్రాంతాల్లో రేపు మన్మోహన్ సింగ్ పర్యటిస్తారు. నాందేడ్ ప్రాంతంలో పర్యటించిన అనంతరం ఆయన సాయంత్రం హైదరాబాద్లోని బేగంపేట విమానాశ్రయం చేరుకుంటారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోని వరద తాకిడి ప్రాంతాల పరిస్థితిని సమీక్షించి ఢిల్లీకి తిరిగి వెళ్లిపోతారు. ఆంధ్రప్రదేశ్లోని వరద తాకిడి ప్రాంతాల్లో యుపిఎ చైర్పర్సన్ సోనియా గాంధీ, కేంద్ర హోం మంత్రి శివరాజ్ పాటిల్ బుధవారం ఆంధ్రప్రదేశ్లోని వరద తాకిడి ప్రాంతాల్లో పర్యటించిన విషయం తెలిసిందే.
Story first published: Thursday, August 10, 2006, 23:53 [IST]