వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కృష్ణానది తీర ప్రాంతాలు జలమయం
విజయవాడ: కృష్ణా జిల్లాలోని కొన్ని గ్రామాలకు వరద ముప్పు ఏర్పడడంతో అధికారులు అప్రమత్తమై ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. కృష్ణా నదిలో వరద నీటిమట్టం పెరుగుతుండడంతో కృష్ణా జిల్లాలోని లోతట్టు ప్రాంతాలకు ముప్పు ఏర్పడింది.
కృష్ణా నది తీర ప్రాంతాల గ్రామాలు జలమయం అవుతున్నాయి. పశ్చిమ కృష్ణా జిల్లాలోని పది గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. కంచికచర్ల, చందర్లపాడు మండలాల్లోని లోతట్టు ప్రాంతాలకు ముప్పు ఏర్పడింది. దీంతో లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. నాగార్జున సాగర్కు చెందిన 26 గేట్లను ఎత్తివేశారు.
Comments
Story first published: Friday, August 11, 2006, 23:53 [IST]