వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్రాలో వర్షాలు

By Staff
|
Google Oneindia TeluguNews

విశాఖపట్టణం, ఆగస్టు 12 : భారీ వర్షాలతో అతలాకుతలం అయిన ఉత్తరాంధ్ర జిల్లాలకు మళ్లీ తుపాను గండం సంభవించే అవకాశాలున్నాయి. గత రెండు రోజులుగా బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావం వల్ల రానున్న 48 గంటల్లో ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖపట్టణం తుపాను హెచ్చరిక కేంద్రం ప్రకటించింది. ఈ వాయుగుండం కారణంగా ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలోని గంజాం, గుణుపూర్‌, గూడారిలలో భారీ వర్షాలు కురుస్తుండగా, విజయనగరం జిల్లాలో ఓ మోస్తరు వానలు పడుతున్నాయి. పశ్చిమదిశలో బలమైన గాలులు వీస్తుండడం వల్ల శ్రీకాకుళం జిల్లాలోని వంశధార, నాగావళికి మరోసారి వరద ముప్పు వుందని వాతావరణశాఖ హెచ్చరించింది. సముద్రం అల్లకల్లోంగా ఉండడంతో జాలర్లు చేపల వేటకు వెళ్ళరాదని అధికారులు సూచించారు. విశాఖ, కాకినాడ, మచిలీపట్నం ఓడరేవుల్లో ఒకటో నెంబరు ప్రమాద సూచికను జారీచేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X