వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తుంగభద్రకు పెరుగుతున్న ప్రవాహం
కర్నూలు: తుంగభద్ర జలాశయానికి నీటి ప్రవాహం పెరుగుతోంది. తుంగభద్ర జలాశయం పూర్తిగా నిండింది. దీంతో 33 గేట్లను ఎత్తివేశారు. తీర ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. కర్నూలు, కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వం అప్రమత్తం చేసింది.
తుంగభద్ర జలాశయానికి 40 వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. ఇది లక్షన్నర క్యూసెక్కులకు చేరే అవకాశం వుంది. దీంతో తుంగభద్ర తీర ప్రాంతాల ప్రజలకు ముప్పు వాటిల్లే ప్రమాదం వుంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టుకు కూడా పెద్ద యెత్తున నీరు వచ్చి చేరుతోంది.
Comments
Story first published: Sunday, August 13, 2006, 23:53 [IST]