వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉత్తరాంధ్రకు తప్పిన వాయుగుండం ముప్పు

By Staff
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: ఉత్తరాంధ్రకు మరో వాయుగుండం ముప్పు తప్పింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఒరిస్సాలో తీరం దాటడంతో ఉత్తరాంధ్ర జిల్లాలకు పొంచి వున్న ముప్పు తప్పిపోయింది. ఒరిస్సాలో బాలాసోర్‌ వద్ద వాయుగుండం తీరం దాటి ఉత్తర వాయవ్య దిశగా పయనించి బలహీనపడుతోంది.

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం వల్ల వచ్చే 24 గంటల్లో ఉత్తర కోస్తాలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశం వుంది. తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం వుంది. సముద్రంలోకి చేపలు పట్టడానికి వెళ్లకూడదని అధికారులు మత్స్యకారులను హెచ్చరించారు. ఇప్పటికే వరదలతో అతలాకుతలమైన ఉత్తరాంధ్ర జిల్లాలకు మరో ముప్పు వాటిల్లే ప్రమాదం వుందనే హెచ్చరికలతో కలవరం మొదలైంది. ఇప్పుడు ఆ ఆందోళన తగ్గింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X