వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తిరుమలకు తండోపతండాలుగా భక్తులు
తిరుపతి: వరుసగా సెలవులు రావడంతో తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి సన్నిధిలో రద్దీ పెరిగింది. క్యూ కాంప్లెక్స్లన్నీ నిండిపోయాయి. వేలాది మంది భక్తులు తిరుమలకు చేరుకున్నారు. దీంతో దైవదర్శనానికి చాలా సమయం పడుతోంది. ఉచిత దర్శనానికి దాదాపు 78 గంటల సమయం పడుతోంది. అన్ని ప్రాంతాల్లో భక్తులు బారులు తీరి కనిపిస్తున్నారు. అధికారులు రద్దీని క్రమబద్దీకరించే ప్రయత్నాలు చేస్తున్నారు.
ఆదివారంనాడు లక్ష మందికి పైగా భక్తులు వచ్చి వుంటారని అంచనా. రెండో శనివారం, ఆదివారం సెలవు దినాలు కలిసి రావడంతో పాటు ఆగస్టు 15, 16 తేదీలు కూడా సెలవులు కావడంతో భక్తులు తిరుమలకు పెద్ద యెత్తున వస్తున్నారు. అధికారులు మహా లఘు దర్శనానికి అనుమతి ఇస్తున్నారు. 50 రూపాయల ప్రత్యేక దర్శనానికి కూడా 70 గంటల సమయం పడుతోంది. తిరుమలలో సౌకర్యాలు పెంచాలని భక్తులు కోరుతున్నారు.
Comments
Story first published: Sunday, August 13, 2006, 23:53 [IST]