వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
జీవో నెం 5 రద్దు: దిగి వ చ్చిన ప్రభుత్వం
హైదరాబాద్: ప్రభుత్వ శాఖల, ప్రభుత్వ రంగ సంస్ధల ఉద్యోగుల తొలగింపునకు ఉద్దేశించిన జీవో నెంబర్ 5ను రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఈ జీవోను రద్దు చేస్తున్నట్టు ఆర్ధిక మంత్రి కొణిజేటి రోశయ్య సోమవారం ఇక్కడ ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగులు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి అనుకూలురని, అటువంటి వారిని దూరం చేసుకునే ఉద్దేశం తమకు లేదని ఆయన చెప్పారు. ప్రపంచ బ్యాంకు ఆదేశాలతో 65 వేల మంది ప్రభుత్వ శాఖల, ప్రభుత్వ రంగ సంస్ధల ఉద్యోగులను తొలగించేందుకే జీవో నెంబర్ 5ను ప్రభుత్వం జారీ చేసిందని సిపిఎం ఆ ఉత్తర్వులను బయట పెట్టడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ సంఘాలు ఆందోళనకు దిగడంతో ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. ఈ జీవోను సవరిస్తామని మొదట చెప్పిన ప్రభుత్వం చివరికి పూర్తిగా జీవోను రద్దు చేసుకోవలసి వచ్చింది.
Comments
Story first published: Monday, August 14, 2006, 23:53 [IST]