వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత జట్టు బస సమీపంలో బాంబు పేలుడు

By Staff
|
Google Oneindia TeluguNews

కొలంబో: కొలంబోలో భారత క్రికెట్‌ జట్టు బస చేసిన తాజ్‌ సముద్ర హోటల్‌కు సమీపంలో బాంబు పేలుడు సంభవించింది. పేలుడులో ఏడుగురు మరణించగా, 50 మందికి పైగా గాయపడ్డారు. ఆ సమయంలో భారత క్రికెట్‌ జట్టు సభ్యులు హోటల్‌లోనే ఉన్నారు. పేలుడు జరిగిన ప్రాంతానికి సమీపంలోనే శ్రీలంక దేశాధ్యక్షుడి నివాసం ఉంది. ఈరోజు జరగవలసిన వన్డే మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దయింది. ఈ మ్యాచ్‌ని రేపు నిర్వహిస్తారు. పాకిస్ధాన్‌ రాయబారిని, ఆయన కుటుంబాన్ని టార్గెట్‌గా చేసుకుని బాంబు దాడి జరిగినట్టు శ్రీలంక ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రమాదం నుంచి పాక్‌ రాయబారి తృటిలో తప్పించుకోగలిగారు. ప్రమాదం జరిగిన ప్రదేశానికి తాజ్‌ సముద్ర హోటల్‌ ఒక కిలోమీటరు దూరంలో ఉంది. బాంబు దాడి పర్యవసానంగా భారత జట్టు బస చేసిన తాజ్‌ సముద్ర హోటల్‌ చుట్టూ భద్రతా దళాలను మోహరించారు. హోటల్‌లోకి వెళ్ళే వారిని క్షణ్ణంగా తనిఖీ చేసి మరీ పంపిస్తున్నారు. బాంబుపేలుళ్ళ కారణంగా భారత జట్టు శ్రీలంక పర్యటనలో మార్పు ఉండదని భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు ప్రకటించింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X