వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఖమ్మం జిల్లాలో చంద్రబాబు మలివిడత పర్యటన

By Staff
|
Google Oneindia TeluguNews

ఖమ్మం: భారీ వర్షాలతో జల ప్రళయంలో చిక్కుకున్న ఖమ్మం జిల్లా భద్రాచలం డివిజన్‌లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సోమవారం రెండోసారి పర్యటించి బాధితులను పరామర్శించారు. సోమవారం ఉదయం ఐదు గంటలకు ఆయన కొత్తగూడెంలో దిగి పర్యటన ప్రారంభించారు. ఆయన మొదట అశ్వాపురం మండలంలోని రెండు గ్రామాలను సందర్శించారు. ఆ తర్వాత సోనియా గాంధీ పర్యటించిన మోతె గ్రామానికి చేరుకుని ఆయన బాధితులను పరామర్శించారు. వరద బాధితులకు ఆయన సమక్షంలో తెలుగుదేశం నాయకులు బియ్యం, పప్పు పంపిణీ చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వరద బాధితులను ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైందని ఆయన విమర్శించారు. కాంగ్రెస్‌ నాయకులు, ఇంచార్జి మంత్రులు ఇంతవరకు వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించకపోవడం దారుణమని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X