వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
చివరి క్షణంలో ఇజ్రాయెల్ మెరుపు దాడులు
తైర్: ఐక్యరాజ్యసమితి జరిపిన ప్రయత్నాలు ఫలించి ఇజ్రాయెల్, లెబనాన్ కాల్పుల విరమణకు అంగీకరించినప్పటికీ, విర మణ అమలు సమయం దగ్గర పడుతున్న సమయంలో హెజ్బొల్లా గెరిల్లాలపై ఇజ్రాయెల్ వైమానిక దళం మెరుపు దాడులు జరిపింది. ఈ దాడిలో 38 మంది లెబనాన్ పౌరులు, నలుగురు సైనికులు మృతి చెందారు. అలాగే ఐదుగురు ఇజ్రాయెల్ సైనికులు కూడా మరణించారు. దాడులను విరమించాల్సిందిగా ఇజ్రాయెల్ మిలటరీ అధికారులను ప్రధాని ఇహుద్ అల్మర్ట్ ఉదయం 4.30 నిమిషాలకు ఆదేశించారు. ఇలా ఉండగా ఐక్యరాజ్యసమితి తీర్మానాన్ని ప్రపంచ దేశాలు స్థిర చిత్తంతో అమలు చేయాలని ఇజ్రాయెల్ కోరింది.
Story first published: Monday, August 14, 2006, 23:53 [IST]