వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజ్‌నాధ్‌ సింగ్‌కు వైఎస్‌, బాబు పరామర్శ

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: ఆదివారం నాడు గుండెపోటుతో హైదరాబాద్‌ యశోదా ఆస్పత్రిలో చేరిన భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాధ్‌ సింగ్‌ ఆరోగ్య పరిస్ధితి నిలకడగా ఉందని వైద్యులు సోమవారం ఉదయం చెప్పారు. ఆదివారం హైదరాబాద్‌ నగరంలో ఆర్‌ఎస్‌ఎస్‌ చింతన్‌ బైఠక్‌ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆ సమయంలో తీవ్రమైన గొంతు నొప్పి రావడంతో ఆయనను యశోదా ఆస్పత్రికి తరలించారు. రక్తపోటు కారణంగా ఆయనకు గుండెపోటు కూడా వచ్చింది. చికిత్స అనంతరం సోమవారం ఆయన పూర్తిగా కోలుకున్నారు. ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోన్‌ ద్వారా రాజ్‌నాధ్‌సింగ్‌ను పరామర్శించారు. రాజ్‌నాధ్‌ సోమవారం సాయంత్రం ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X