వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పరేడ్ గ్రౌండ్స్లో ముమ్మర భద్రతా ఏర్పాట్లు
హైదరాబాద్: టెర్రరిస్టులతో పాటు నక్సలైట్లు కూడా దాడులు చేసే అవకాశం ఉండడంతో రేపు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జంటనగరాల్లో భద్రతా ఏర్పాట్లను పోలీసులు ముమ్మరం చేశారు. ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి రేపు పతాన వందనం స్వీకరించనున్న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ ప్రదేశం గత పదిహేను రోజులుగా పోలీసుల అధీనంలో ఉంది. ఇక్కడి అణువు అణువునూ పోలీసులు జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. స్వాతంత్య్ర దినాన భారత దేశంలోని ప్రధాన నగరాలపై టెర్రరిస్టులు దాడి చేసే అవకాశముందని అమెరికా కూడా హెచ్చరించిన విషయం తెలిసిందే. పరేడ్ గ్రౌండ్స్లో రేపు జరుగనున్న కార్యక్రమానికి ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరు కానుండడంతో ఎంతో జాగ్రత్తగా భద్రతా చర్యలను చేపట్టవలసిన అవసరం ఏర్పడింది.
Comments
Story first published: Monday, August 14, 2006, 23:53 [IST]