పిజెఆర్తో దిగ్విజయ్: వైఎస్కు తలనొప్పి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి దిగ్విజయ్ సింగ్తో బుధవారం ఉదయం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పి. జనార్ధనరెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి సమావేశం కావడంతో రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయాలు వేడెక్కాయి. ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అనుసరిస్తున్న కొన్ని విధానాలు నచ్చని పిజెఆర్, మర్రి కొంత కాలంగా అధిష్టానవర్గానికి తమ అసమ్మతి గళాన్ని విన్పిస్తున్న సంగతి తెలిసిందే. వైఎస్ తప్పిదాలను అసమ్మతి వాదుల నుంచి తెలుసుకోడానికే దిగ్విజయ్ సింగ్ ఈసారి ప్రత్యేకంగా హైదరాబాద్ పర్యటన పెట్టుకున్నట్టు తెలుస్తోంది. గతంలో చంద్రబాబు నాయుడు చేసిన తప్పులనే ఇప్పుడు వైఎస్ చేస్తున్నారని, దీనివల్ల కాంగ్రెస్ పార్టీ నష్టపోతోందని పిజెఆర్, మర్రి నేడు దిగ్విజయ్ సింగ్ సవివరంగా తెలియజేశారు. 610 జీవో అమలు, పోతిరెడ్డి పాలెం రెగ్యులేటర్, ఔటర్ రింగ్రోడ్డులో భూముల స్వాధీనం వంటి అంశాలను వీరు దిగ్విజయ్కి వివరించారు. పి. జనార్ధనరెడ్డిని మంత్రివర్గంలో చేర్చుకోమని దిగ్విజయ్ సింగ్ కొంతకాలంగా ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి మీద వత్తిడి చేస్తున్నారు. కానీ తనకు మంత్రి పదవి మీద వ్యామోహం లేదని, పార్టీ ప్రతిష్టను కాపాడుకోవడం ముఖ్యమని భావిస్తున్నానని పిజెఆర్ అధిష్టానవర్గానికి చెబుతూ వస్తున్నారు. ఇంతకాలం తనకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చిన అధిష్టానవర్గం ఇప్పుడు అసమ్మతి వాదుల వాణిని వినడంతో ముఖ్యమంత్రి వైఎస్ ఆగ్రహాన్ని, అసహనాన్ని వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది.