వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కొత్త కార్యాలయంలోకి మారిన వైయస్
హైదరాబాద్: ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి గురువారంనాడు సచివాలయంలోని కొత్త కార్యాలయంలోకి మారారు. ఇంతకు ముందు ఉన్న సి బ్లాక్లోని నాలుగో అంతస్థు నుంచి అదే బ్లాక్లోని ఆరో అంతస్థులోకి ఆయన తన కార్యాలయాన్ని మార్చుకున్నారు. ఆధునిక హంగులతో కార్పోరేట్ స్థాయిలో దీని నిర్మాణం జరిగింది. వేద మంత్రాల మధ్య పురాణ పఠనంతో ఆయన నూతన కార్యాలయంలోకి ప్రవేశించారు.
ముఖ్యమంత్రి గురువారం ఉదయం సరిగ్గా 11 గంటల 40 నిమిషాలకు కొత్త కార్యాలయంలో అడుగు పెట్టారు. అనంతరం 11 గంటల 55 నిమిషాలకు కొత్త కార్యాలయంలో ఫైలుపై తొలి సంతకం చేశారు. 2006 - 2007 సంవత్సరంలో మెట్ట ప్రాంతాల్లోని రైతులకు 50 వేల ఉచిత విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలని, మరో లక్ష తాత్కాలిక కనెక్షన్లు ఇవ్వాలని నిర్ణయించిన ఉత్తర్వులపై ఆయన సంతకం చేశారు.
Comments
Story first published: Thursday, August 17, 2006, 23:53 [IST]