వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
లంచం తీసుకుంటూ చిక్కిన సిటివో వాసవి
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా వాణిజ్య పన్నుల అధికారి (సిటివో) వాసవి అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. రెండు లక్షల రూపాయల లంచం తీసుకుంటూ ఆమె తన ఇంట్లోనే ఎసిబి అధికారులకు చిక్కారు. శక్తి ట్రేడర్స్ అనే బంగారం వ్యాపారి వెంకటేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎసిబి అధికారులు దాడి చేశారు. వెంకటేశ్వరరావు నుంచి ఆమె లంచం అడిగారు. దీంతో ఎసిబి అధికారులు వల పన్ని ఆమెను పట్టుకున్నారు.
వాసవి ఇంటిలోంచి ఐదున్నర లక్షల రూపాయల నగదు, కిలో బంగారం, వెండి నగలను ఎసిబి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నల్లగొండ జిల్లా డియస్పీగా పని చేస్తున్న ఆమె భర్త ఇంటిపై కూడా ఎసిబి అధికారులు దాడులు నిర్వహించారు. నల్లగొండ జిల్లాలోని భువనగిరిలో వున్న ఆమె ఆస్తులపై కూడా వారు దాడులు చేసినట్లు సమాచారం.
Comments
Story first published: Thursday, August 17, 2006, 23:53 [IST]