వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజకీయం ముసుగులో వ్యాపారం: జయప్రకాశ్‌

By Staff
|
Google Oneindia TeluguNews

వరంగల్‌: ప్రస్తుతం రాజకీయం ముసుగులో వ్యాపారం జరుగుతోందని, దీనికి ప్రత్యామ్నాయం అవసరమని లోక్‌సత్తా నాయకుడు జయప్రకాశ్‌ నారాయణ్‌ అన్నారు. జిల్లాలవారీగా తలపెట్టిన లోక్‌సత్తా రాజకీయ పార్టీ సన్నాహక సదస్సుల్లో పాల్గొనడానికి వచ్చిన ఆయన గురువారంనాడు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. స్వార్థం కోసం రాజకీయ నాయకులు కుల, మత, వర్గ విభేదాలను రెచ్చగొడుతున్నారని ఆయన విమర్శించారు.

ప్రభుత్వం రైతుల భూములను బలవంతంగా లాక్కుని మోసం చేస్తోందని ఆయన అన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న విద్య, వైద్య సౌకర్యాలు సరిగా లేకపోవడం వల్లనే ప్రజలు ప్రైవేట్‌ సంస్థల వైపు చూస్తున్నారని ఆయన అన్నారు. ప్రస్తుత పరిస్థితులను పూర్తిగా మార్చడం అవసరమని, ప్రయత్నిస్తే పరిస్థితులను మార్చడం సాధ్యమేనని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X