వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మరణించిన పోలీసుల కుటుంబాలకు పరిహారం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: మావోయిస్టుల కాల్పుల్లో మరణించిన నల్గొండ జిల్లా ఆత్మకూర్‌ (ఎం) సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ చాంద్‌ పాషా, ఎఎస్‌ఐ సుల్తాన్‌ మొయినుద్దీన్‌, హోంగార్డు లింగయ్యల కుటుంబాలకు వారి సర్వీసు పూర్తయ్యేవరకు జీత భత్యాలు చెల్లిస్తామని ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి శనివారం ఉదయం ఇక్కడ ప్రకటించారు. హోంగార్డు కుటుంబానికి 5 లక్షలు, ఎస్‌ఐ, ఎఎస్‌ఐ కుటుంబాలకు 9 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లిస్తామని తెలిపారు. చనిపోయిన పోలీసు ఉద్యోగుల కుటుంబాలకు ఇళ్ళ స్ధలాలు, ప్రతి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హోంమంత్రి ప్రకటించారు. మావోయిస్టుల చర్యలు ఫ్యాక్షనిస్టులను తలపిస్తున్నాయని హోంమంత్రి జానారెడ్డి వ్యాఖ్యానించారు. సంఘటన స్ధలాన్ని జానారెడ్డి, డిజిపి స్వరణ్‌జిత్‌ సేన్‌లు శనివారం ఉదయం సందర్శించారు. విప్లవ రచయితల సంఘం నాయకులను అరెస్టు చేయాలని నల్గొండ జిల్లా పోలీసు అధికారుల సంఘం డిమాండ్‌ చేసింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X