వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కాంగ్రెస్ నేతల రాజీనామాకు మావోయిస్టుల డిమాండ్
హైదరాబాద్: నల్గొండ జిల్లా ఆత్మకూర్ (ఎం) సబ్ ఇన్స్పెక్టర్, ఎఎస్ఐ, హోంగార్డులను శుక్రవారం రాత్రి మావోయిస్టులు కాల్చి చంపిన ప్రదేశంలో మావోయిస్టు పార్టీ జిల్లా కార్యదర్శి రవి రాసిన లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాంగ్రెస్ నాయకులు తక్షణం ప్రభుత్వ పదవులకు రాజీనామా చేయాలని ఆయన ఆ లేఖలో డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్ధితికి పోలీసు అధికారులే కారణమని ఆరోపించారు. మావోయిస్టులు పోలీసు సిబ్బందిని చెట్లకు కట్టేసి కాల్చి చంపారు. ఎకె 47 తుపాకితో వారిపై కాల్పులు జరిపినట్టు పోలీసు ఉన్నతాధికారులు అంచనా వేశారు. పోలీసుల మృతదేహాలను నల్గొండకు తరలించారు.
Comments
Story first published: Saturday, August 19, 2006, 23:53 [IST]