వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
చైన్నై - హైదరాబాద్ రైలులో పేలుడు
హైదరాబాద్: చెన్నై - హైదరాబాద్ రైలులో పేలుడు సంభవించింది. అయితే ప్రమాదంలో ప్రాణ నష్టం జరగలేదు. రెండున్నర కోట్ల రూపాయల వరకు ఆస్తి నష్టం సంభవించినట్లు అంచనా. చైన్నై నుంచి సికింద్రాబాద్కు చేరుకున్న రైలు నాంపల్లికి బయలుదేరింది. బయలుదేరిన కొద్దిసేపటికే ఎస్ 9 బోగీలో పెద్ద యెత్తున పేలుడు సంభవించింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు ఆ బోగీని రైలు నుంచి వేరు చేశారు. మొత్తం ఐదు బోగీలు మంటలకు ఆహుతి అయ్యాయి.
సంఘటనపై దర్యాప్తు జరిపిస్తున్నామని దక్షిణ మధ్య రైల్వే అధికారి మాథూర్ చెప్పారు. సంఘటనపై భద్రతా కమీషనర్ అగర్వాల్ ఈ నెల 23వ తేదీన విచారణ జరుపుతారని ఆయన చెప్పారు. ఇప్పటికే ఫోరెన్సిక్ నిపుణులు సాక్ష్యాలు సేకరించారు.
Comments
Story first published: Sunday, August 20, 2006, 23:53 [IST]