వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నవ దంపతులకు తొలిరాత్రే అంతిమ రాత్రి
హైదరాబాద్: అనంతపురం జిల్లాలో నవదంపతులకు తొలి రాత్రే అంతిమ రాత్రి అయిన విషాద సంఘటన చోటు చేసుకుంది. అనంతపురం జిల్లా తగరకుంటకు చెందిన వెంకట్రాముడితో అకలేడు గ్రామానికి చెందిన సరస్వతికి ఈ నెల 18వ తేదీన వివాహం జరిగింది. మంచి ముహూర్తాలు లేకపోవడంతో వారిద్దరికి శనివారం రాత్రి పెళ్లికూతరు ఇంట్లో శోభనం ఏర్పాటు చేశారు.
తెల్లారి చూసేసరికి భార్య రక్తం మడుగులో పడి వుండగా భర్త ఉరి వేసుకుని మరణించి వుండడం ఆ రెండు కుటుంబాలను విషాదంలో ముంచేసింది. రోకలితో కొట్టి భార్యను భర్తను చంపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. భార్యను చంపిన అనంతరం భర్త ఉరి వేసుకుని మరణించాడని వారంటున్నారు.
Comments
Story first published: Sunday, August 20, 2006, 23:53 [IST]