వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైద్యం అందక రోగి మృతి: డాక్టర్‌పై దాడి

By Staff
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: వైద్యం అందక విశాఖపట్నం కెజిహెచ్‌ ఆస్పత్రిలో శ్రీను అనే రోగి మృతి చెందాడు. లంచం కోసం పట్టుబట్టిన వైద్యులు రోగికి వైద్యం అందించలేదని, దాంతో శ్రీను మరణించాడని ఆయన బంధువులు అరోపిస్తున్నారు. ప్రమాదానికి గురైన శ్రీనును ఆదివారం ఉదయం నాలుగు గంటల ప్రాంతంలో కెజిహెచ్‌కు తీసుకొచ్చామని, వైద్యం అందించాలని కోరితే డాక్టర్‌ 70 వేల రూపాయల లంచం డిమాండ్‌ చేశారని వారు చెప్పారు. మధ్యతరగతికి చెందిన తాము అంత డబ్బు ఇచ్చుకోలేమని చెప్పినా డాక్టర్‌ పట్టించుకోలేదని వారు చెప్పారు. శ్రీను మృతదేహాన్ని తమకు అప్పగించకుండా దాచిపెట్టడంతో అతని బంధువులు డాక్టర్‌పై దాడికి దిగారు. ఆస్పత్రిలోని కుర్చీలను, ఇతర ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు.

శ్రీను బంధువుల ఆరోపణలను కెజిహెచ్‌ ఆస్పత్రి ఇన్‌చార్జి సూపరింటిండెంట్‌ ఖండిస్తున్నారు. స్కానింగ్‌ తీసికెళ్తుండగా శ్రీను మరణించాడని ఆమె అంటున్నారు. వైద్యుడంటే దేవుడు కాదు కదా, తమ ప్రయత్నాలు తాము చేస్తుండగానే అతను మరణించాడని వైద్యులు చెబుతున్నారని ఆమె అన్నది. అయినా ఈ విషయంపై విచారణ జరిపిస్తామని ఆమె చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X