వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రెండో ఎస్సార్సీ కన్నా నిపుణుల కమిటీ మేలు: సిపిఐ

By Staff
|
Google Oneindia TeluguNews

గుంటూరు: తెలంగాణపై అధ్యయనానికి రాష్ట్రానికి చెందిన నిపుణులతో కమిటీ వేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రెండో ఎస్సార్సీని ఏర్పాటు చేయడం కన్నా నిపుణుల కమిటీ వేయడమే మంచిదని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. కాలయాపన చేయడానికే రెండో ఎస్సార్సీ ఉపయోగపడుతుందని ఆయన అన్నారు.

నిపుణుల కమిటీ వేసి తెలంగాణ ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతి అంశాలపై లోతైన విశ్లేషణ చేయించి నివేదిక కోరడం ఉపయోగకరంగా వుంటుందని, దీన్ని బట్టి తెలంగాణ విడిపోతే ఉపయోగమా, కలిసి వుంటే ప్రయోజనం చేకూరుతుందా అని తెలుసుకోవచ్చునని, నివేదికను బట్టి తదుపరి చర్యలు తీసుకోవచ్చునని ఆయన అన్నారు. తెలంగాణ అంశంపై తెరాస సభ్యులు శాసనసభా కార్యక్రమాలను స్తంభింపజేయడం చెడు సంప్రదాయమని అన్నారు. శీతల పానీయాలకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం చేపడతామని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X