వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ: తెరాస కార్యకర్తల రైల్‌ రోకో

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: తెలంగాణపై కాంగ్రెస్‌ వైఖరికి నిరసనగా తెలంగాణలో ఆందోళనలు సాగుతూనే వున్నాయి. వరంగల్‌లో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) కార్యకర్తలు శుక్రవారం రైల్‌రోకో నిర్వహించారు. దీంతో కృష్ణా, శాతవాహన ఎక్స్‌ప్రెస్‌లు 20 నిమిషాల పాటు ఆగిపోయాయి. కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీకి, ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖర రెడ్డికి వ్యతిరేకంగా ఆందోళనకారులు నినాదాలు చేశారు. నిజామాబాద్‌ జిల్లాలో ప్రైవేట్‌ విద్యాసంస్థలు శుక్రవారంనాడు బంద్‌ నిర్వహించాయి. ఆదిలాబాద్‌ జిల్లా బెల్లంపల్లిలో తెరాస కార్యకర్తలు నిరాహార దీక్షలు చేపట్టారు.

ఆదిలాబాద్‌ జిల్లా మంచిర్యాలలో ఎపి ఎక్స్‌ప్రెస్‌ను ఆపి ధర్నా చేయడానికి ప్రయత్నించిన తెరాస కార్యకర్తలను పోలీసులు అదుపులోకీ తీసుకున్నారు. మంచిర్యాల, రామకృష్ణాపూర్‌ తదితర ప్రాంతాల్లో తెరాస కార్యకర్తలు రాస్తారోకోలు, ధర్నాలు నిర్వహించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X