వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అమర్నాధ్ శివలింగం సహజమైనదే: కమిటీ నివేదిక
శ్రీనగర్: అమర్నాధ్ గుహలో శివలింగం సహజంగా ఏర్పడినదేనని ఏకసభ్య సంఘం తేల్చి చెప్పింది. అమర్నాధ్ యాత్ర సమయంలో కృత్రిమ శివలింగాన్ని ఏర్పాటు చేశారని ఆరోపణలు వచ్చిన నేపధ్యంలో కెకె గుప్తా కమిటీ విచారణ జరిపింది.
ఈ కమిటీ అమర్నాధ్ ఆలయ బోర్డుకు గుప్తా క్లీన్చిట్ ఇచ్చారు. జమ్ము-కాశ్మీర్ గవర్నర్కు ఈ కమిటీ 90 పేజీల నివేదికను సమర్పించింది. శివలింగం ఏర్పడడంలో ఆలయ సిబ్బంది ప్రమేయం లేదని అది సహజంగా ఏర్పడినదేనని గుప్తా నివేదికలో స్పష్టం చేశారు.
Story first published: Saturday, August 26, 2006, 23:53 [IST]