వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ముషీరాబాద్లో టిఆర్ఎస్ రాస్తారోకో
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యే నాయిని నరసింహారెడ్డి నాయకత్వంలో టిఆర్ఎస్ కార్యకర్తలు హైదరాబాద్లోని ముషీరాబాద్ చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించారు. దానితో ఈ ప్రాంతంలో కొంతసేపు ట్రాఫిక్ స్తంభించింది.
ఈ సందర్భంగా నాయిని నరసింహారెడ్డి మాట్లాడుతూ మాయదారి కాంగ్రెస్ను తాము ఎన్నడూ నమ్మలేదని, సోనియా గాంధీపై పెట్టుకున్న నమ్మకం వమ్మయిందని ఆయన అన్నారు. ఎన్నికల ముందు తమ బలాన్ని చూసి పొత్తుకోసం కాంగ్రెస్ పార్టీయే ముందుకు వచ్చిందని ఆయన చెప్పారు. రాస్తోరోకో చేస్తున్న నాయిని నరసింహారెడ్డిని, ఆయన అనుచరులను పోలీసులు అరెస్టు చేసి ముషీరాబాద్ పోలీసు స్టేషన్కు తరలించారు.
Comments
Story first published: Saturday, August 26, 2006, 23:53 [IST]