వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రముఖ రచయిత నరసరాజు మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: ప్రముఖ రచయిత (86)డి.వి నరసరాజు మరణించారు. 1920లో జన్మించిన నరసరాజు పూర్తి పేరు దాట్ల వెంకట నరసరాజు. అయన అనేక విజయవంతమైన తెలుగు సినిమాలకు కథలను, మాటలను అందించారు. గుండమ్మ కథ, రాముడు-భీముడు, యమగోల వంటి సినిమాలకు ఆయన మాటలు రాశారు. 1949లో ఆయన తొలినాటకం అంతర్వాణి వెలుగు చూసింది.

పెద్ద మనుషులు సినిమా ద్వారా ఆయన చలనచిత్ర రంగ ప్రవేశం చేశారు. 12 ఏళ్ళ వయసులోనే మేనమామ కూతురిని పెళ్ళి చేసుకున్న నరసరాజు ఇటీవలే అదృష్టవంతుడి ఆత్మకథ పేరుతో తన జీవిత చరిత్ర గ్రంధాన్ని వెలువరించారు. తెలుగు సినిమా, నాటక రంగాలతో సుదీర్ఘ అనుబంధం గల నరసరాజుకు విజయ, వాహినీ స్టూడియోలతో ప్రత్యేక అనుబంధముంది. నరసరాజు అంత్యక్రియలు రేపు మంగళవారం హైదరాబాద్‌లో జరుగుతాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X