ఇలా అయితే నేను పార్టీ పెట్టను: లోక్సత్తా కన్వీనర్
శ్రీకాకుళం: డబ్బును, నేరమయ రాజకీయాలను రాజకీయ పార్టీలు వదులుకుని నూతన రాజకీయాలకు ఒరవడి దిద్దితే తాను రాజకీయ పార్టీని ఏర్పాటు చేయబోనని లోక్సత్తా కన్వీనర్ జయప్రకాశ్ నారాయణ్ అన్నారు. రాజకీయాలు ఉత్తమ వ్యాసంలాంటివని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. తమ లోక్సత్తా పార్టీ ఇంకా ఏర్పడలేదని ఆయన చెప్పారు. సంపూర్ణ మద్యపాన నిషేధం సాధ్యం కాదని, అయితే కొంత వరకు మద్యపానాన్ని నియంత్రించవచ్చునని ఆయన అభిప్రాయపడ్డారు.
సమాజంలో చిన్న చూపునకు గురయ్యే వారికి తమ పార్టీలో అధిక ప్రాధాన్యం ఇస్తామని ఆయన అన్నారు. ఇప్పటికే రాజకీయ పార్టీలు తమ బాణీని మార్చాయని, బాణీని మార్చుకోవడమే కాకుండా చర్యలను కూడా మార్చుకుంటే మంచిదని ఆయన అన్నారు. ఢిల్లీలోనో, హైదరాబాద్లోనో అధికారాన్ని కేంద్రీకరించకుండా స్థానిక సంస్థలకు అధికారాలను వికేంద్రీకరించడం అవసరమని ఆయన అన్నారు. ప్రజలకు సరైన విద్య, వైద్యం అందుబాటులోకి రావాలని, పోలీసులు ప్రజల కోసం పని చేయాలని, ఇటువంటి పరిస్థితుల్లో తాము పార్టీ పెట్టాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.